అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అన్నార్థులకు ఆహారం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి దిగ్విజయముగా నేటికి 38వ రోజు పూర్తి అయినది. 24మే 2020 రోజున బేబీ సురక్షా, D/o నాగమళ్ళ స్వప్న SWE Hyderabad వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, వెలగందుల చాణక్య గుప్త, అనంతుల కుమారస్వామి, గుంటూరు వెంకటనారాయణ,గందే రాజేంద్ర కుమార్, గన్ను నటరాజ శేఖర్, దేవా మధుబాబు, పబ్బా వీరయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 240 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా, ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని అవోపా అధ్యక్షుడు కోరుకుంటున్నారు.
అవోపా హన్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి