అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంభించి నేటికి 18వ రోజు. కాపర్తి రమ్య w/o అనిల్ SWE - USA, పుట్టినరోజు సందర్భంగా ( కాపర్తి కోటిలింగం - విజయలక్ష్మిల కుమారుడు - కోడలు) ల సహకారం తో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, ఫౌండర్ శ్రీ పోకల చందర్, మరియు అకినపెళ్ళి సత్యనారాయణ, యాంసాని నర్సింహమూర్తీ, దేవా అరవింద్, దేవా మహేందర్, దేవా మధుబాబు, అల్లెంకి చంద్రశేఖర్ కొండూరు పశుపతీశ్వర్ నాధ్, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటుగా, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి