దేశం కోసం వీర మరణం పొందిన ఆర్యవైశ్య సింహం కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి కి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కే.సి.ఆర్ గారు తదితరులు


ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య శ్రీమతి సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ప్రశాంత్ రెడ్డి, శ్రీ నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపి శ్రీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు శ్రీ గ్యాదరి కిశోర్, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ చిరుమర్తి లింగయ్య, శ్రీ సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దీపికా యుగంధర్ రావు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సంతోషి వాణిజ్య పన్నుల అధికారిగా గాక ప్రజలకు సేవ చేయుటకు డిప్యూటీ కలెక్టర్ పదవిని ఎంచుకొని నందులకు అభినందనలు తెలియజేస్తూ సంతోష్ బాబు గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకొనుచున్నవి.


కామెంట్‌లు