అభినందనలు

తేదీ 15.10.2023 రోజున వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక సేవాసమితీ వారు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వెనిశెట్టి రవికుమార్ అధ్యక్షతన  హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమములో APJ అబ్దుల్ కలామ్ నేషనల్ లేవల్ టీచింగ్ ఎక్సలెన్సి అవార్డ్ - 2023 కి ఎంపికై న కొందరితో బాటు నాగర్ కర్నూల్ జిల్లా చెన్నారం అప్పర్ ప్రైమరీ స్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ కందికొండ శ్రీనివాస్ గారిని  సన్మానించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కో-అపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ (జిల్లా జడ్జి) శ్రీ వై. సత్యేంద్ర గారు అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ అబ్బయ్య గారు, గెస్ట్ ఆఫ్ హానర్ గా శ్రీమతి అంజనీకుమారి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ కోర్ట్స్, ప్రత్యేక అతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ మరియు పూర్వ అవోపా హనుమకొండ వ్యవస్థాపక కార్యదర్శి మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు శ్రీ పోకల చందర్ గారు,  మరొక అతిథి  డి.ఆర్ అకాడమీ ఎం.డి పి.దేవేందర్ రెడ్డి గారు,  మడుగురి నాగేశ్వరరావు, శిరుప సతీష్ కుమార్, ములుగు యూనిట్ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి కిషోర్, కోశాధికారి యాదా నాగరాజు , ఉపాధ్యక్షులు పడమటింటి నగేష్ గారలు తదితరులు హాజరై అవార్డ్ గ్రహితను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు,  కమిటీ సభ్యులు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి తదితరులు కూడా అభినందించారు. 
కామెంట్‌లు