అవోపా మిర్యాలగూడ వారిచే 2వ డోసు కరోన టీకా వేయించుట

తేదీ 17.7.2021 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా వారు ఏర్పాటు చేసిన  కోవ్యాక్సిన్ 2వ డోసు కరోన టికాను యశోదా హాస్పిటల్ మాలక్పేట్ వారి సౌజన్యంతో 18 సం లు పై బడిన వారికి ఇచ్చుటకు ఏర్పాట్లు చేయనైనది. ఈ కార్యక్రమంలో ముందుగా బుక్ చేసుకున్న 320 మంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో  2వ డోసు కరోన టికాను వేయించుకున్నారు. ఈ కార్యక్రమములో అవోపా అధ్యక్షుడు శ్రీ ఏచూరి మురహరి, కార్యదర్శి శ్రీ గుంటూరు జనార్దన్,  శ్రీ ఏచూరి శ్రీనివాస్, శ్రీ చిల్లంచెర్ల శ్రీనివాస్, శ్రీ రంగా శ్రీధర్ తదితరులు పాల్గొ ని కార్యక్రమాన్ని విజయవంత మొనర్చారు.


కామెంట్‌లు