అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 20వ రోజు. 1) నాగమళ్ళ అశోక్ - మాధవి, ల పెళ్లి రోజు సందర్భంగా 2) గంపా విజయలక్ష్మి w/o గంపా ఈశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా వీరి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప్పారావు, ఫౌండర్ సభ్యుడు శ్రీ కే.రమణయ్య మరియు యాంసాని నర్సింహమూర్తీ, గంపా రవీందర్, దొంతుల కృష్ణమూర్తి, దేవా అరవింద్, దేవా మధుబాబు, కొండూరు పశుపతీశ్వర్ నాథ్ , వెలగందుల చాణక్య గుప్త, వనమాల రమేష్, అకినపెల్లి సత్యనారాయణ, రఘువీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ వారి కమిటి కోరుకొంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి