అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 28వ రోజు. రామిడి వీరేశం - శోభ కుటుంబం (కుమారుడు- కోడలు, మనవడు, సందీప్ - దివ్య:: నిద్విత్, రెండవ కుమారుడు - కార్తీక్.) సహకారం తో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, అల్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, అకినపెల్లి సత్యనారాయణ(Hnk) దొంతుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 250 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈ రోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి