అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 25వ రోజు 1) కటకం శివప్రసాదు - మంజుల 2) చందుపట్ల సూర్య ప్రకాష్ - రేణుకల సహకారంతో ఈ రోజు కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, అల‌్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, దొంతుల కృష్ణమూర‌్తి, నూకల శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొనగా దాదాపు 200 మందికి పైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా హన‌్మకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు. 


 


కామెంట్‌లు