రాష్ట్ర అవోపా ఈ.సి మెంబెర్ నాగిళ్ళ గోపాల్ గుప్త గారి భూరి విరాళం



తెలంగాణ రాష్ట్ర అవోపా కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు, అవోపా నగర్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యుడు, శాదనగర్ నివాసి శ్రీ నాగిళ్ళ గోపాల్ గుప్త గారు ప్రస్తుతము రాష్ట్రాన్ని పిడిస్తున్న కోవిద్-19 వైరస్ ను ఎదుర్కొనడానికి దాని విషపు కోరల నుండి ప్రజలను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుచున్న కార్య క్రమాల్లో చేయూత నివ్వడానికి తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రు.1,00,116 లు విరాళంగా చెక్కుద్వారా చెల్లించారు. ఇందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు