అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంభించబడి నేటికి 14వ రోజు. ఈ రోజు కార్యక్రమం వరంగల్ వాస్థవ్యులు శ్రీ యిరుకుళ్ళ శివకుమార్ - నాగమణిల కుమారుడు, కోడలు యిరుకుళ్ళ సందీప్ - సౌజన్య, (SWE - USA) ల సహకారం తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కాపర్తి కోటిలింగం, అల్లెంకి చంద్ర శేఖర్, దేవా మధుబాబు, తదితరులు పాల్గొనగా దాదాపు 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన శ్రీ యిరుకుళ్ళ శివకుమార్ - నాగమణిల కుటుంబానికి "వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని యెల్లెంకి రవీందర్ అధ్యక్షుడు అవోపా, హన్మకొండ మరియు వారి కమిటీ కోరుకోనుచున్నారు.
అవోపా హనుమకొండ వారిచే 14వ రోజు ఆహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి