12వ రోజు అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంభించి దిగ్విజయముగా నేటికి 12 వ రోజు.    శ్రీ పోకల చందర్, శ్రీ పబ‌్బ రవిచందర్ల సహకారంతో ముఖ్యంగా వీరి జన‌్మదినం సందర్భంగా  ఈ కార్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప‌్పారావు, కే.రమణయ‌్య, అలుగూరి శివకుమార్, మాదారపు వేణుగోపాల్, తాటిపెల‌్లి గోపాలకృష్ణమూర్తి, దేవా మధుబాబు,  రఘువీరప‌్రసాద్, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమము నకు సహకరించిన శ్రీ పోకల చందర్ - దేవి దంపతులకు, మరియు శ్రీ పబ‌్బ రవిచందర్ - సునీత దంపతులకు ఆ " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో, మరింతగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ వారి కమిటీ కోరుకుంటున్నారు.



 


 


కామెంట్‌లు