సిరిపురం కు అమెరికాలో జరుగు సదస్సుకు ఆహ్వానం

 



గత 30 సంవత్సరాలుగా ఎల్.ఐ.సి ఏజెంట్ గా పనిచేస్తున్న మంచిర్యాల నివాసి తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి శ్రీ సిరిపురం శ్రీనివాస్ గారు వచ్చే ఏడాది అమెరికాలో జరిగే అంతర్జాతీయ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ (ఎం.డి.ఆర్.టి) సమావేశాలకు ఎంపికయ్యారు. వీరు జీవిత భీమా ఏజెంట్ గా పనిచేసిన కాలంలో 'ఏజెంట్ భూషణ్', 'భిమారత్న' 'శతక్ వీర్' అను బిరుడులతో పాటు అనేక ప్రశంసా పత్రాలను పొందారు. వీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా అవోపా మరియు లయన్స్ క్లబ్ ల ద్వారా చేయుచున్నారు. అంతర్జాతీయ సదస్సుకు అర్హత పొందిన వీరిని పలువురు అభినందిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకుడు నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము అభినందిస్తున్నవి. 


 


కామెంట్‌లు