FAI వారిచే లక్ష తులసి మొక్కల పంపిణీ కార్యక్రమము

 


లక్ష తులసి మొక్కల  పంపిణీ  కార్యక్రమం  బై ఫెడరేషన్ ఆఫ్ పారిస్ ఆఫ్ ఇండియా (FAI)

FAI  వారు హైదరాబాద్     మరియు   సికింద్రాబాద్   లోని 27 సెంటర్లో  ఈ    లక్ష తులసి మొక్కల (  మెడిసినల్  ప్లాంట్స్)  పంపిణీ కార్యక్రమాన్ని  5 సెప్టెంబర్ 2021  నాడు  ఎమ్మెల్యే శ్రీ బీగాల గణేష్ గుప్తా గారు  , మరియు ఐ ఎఫ్ ఎస్ ఆఫీసర్ N Kshthija gari   కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చేతుల మీదుగా వైస్ప్రొ భవన్   పంజాగుట్ట నందు ప్రారంభించారు .

ఈ ప్రారంభం తరువాత ఈ 27 ప్రాంతాలలో  వారు వారి వారి లోకల్   లీడర్స్  ద్వారా తులసి మొక్కల కార్యక్రమాన్ని  ముందుకు తీసుకొని వెళ్ళారు.

ఈ తులసి మొక్కల కార్యక్రమం ఐదో తారీకు నుండి   తొమ్మిదవ  తారీకు వరకు ఉంటుంది.

FAI  వివిధ సంస్థలను చారిటబుల్ ట్రస్ట్ లను పాఠశాలలను భాగస్వాములుగా చేసి ఈ  లక్ష తులసి మొక్కలు పంపిణీ చేయటం  జరిగింది.

ఈ మొక్కలు తీసుకొని వెళ్ళటానికి వీలు గా ఒక పర్యావరణ   స్థితులకు లోబడి ఉండే బ్యాగ్స్ లో  అందరికీ అందజేయబడింది. 

ఈ కార్యక్రమానికి    సహాయం అందించిన వారు వైష్ణవ అర్బన్ గ్రీన్స్ విజయ్ కుమార్ గారూ,  జిహెచ్ఎంసి,  బండారు సుబ్బారావు గారు సీఎం డి sealwel కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్,  రవీంద్ర కుమార్ అగర్వాల్ గారు  సీఎండి దివ్య శక్తి ప్రైవేట్ లిమిటెడ్ , సుంకు బాలచంద్ర ఫౌండర్ అభయ పౌండేషన్ .

FAI  జాతీయ అధ్యక్షుడు  BELDI శ్రీధర్ గారు తులసి మొక్క ప్రాముఖ్యతను గురించి   ఔషధ గుణాల గురించి  మొక్క దగిన మొక్క అని   ఆరోగ్యప్రదాయిని అని   అందరికీ ZOOM వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చక్కగా వివరణ  ఇచ్చారు. అందరిని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనమని సందేశం ఇచ్చారు.

ఇంకా సుమారు 25 ప్రాంతాలలో పంపిణీ చేయటానికి ఆసక్తి చూపుతున్న  సంస్థల గురించి తెలిపారు.   వారందరికి కూడా రెండవ విడత ఈ కార్యక్రమంలో  భాగస్వామ్యం కలిగించటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ రెండవ విడత కార్యక్రమం 15, 20 రోజుల్లో ప్రారంభం కానున్నదని  తెలియజేశారు.

ఈ సందర్భంగా అలేఖ్య పాలడుగుల  ను  జూనియర్ సివిల్ జడ్జిగా  slect అయినందుకు  ముఖ్య అతిథుల చేతుల మీదుగా  సన్మానించారు.

మీటింగులో వివిధ ప్రాంతాలలో పంపిణీ చేస్తున్న సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో అభిప్రాయాలను తెలిపారు.  ఈ లక్ష   తులసిమొక్కల  పంపిణీ కార్యక్రమం అమోఘమైన దని  అత్యవసర మైనదని  అందరూ ఎఫ్ ఏ ఐ  ను  అభినందించారు.

ప్రాజెక్టు చైర్మన్ గ్రంధి రమేష్ కుమార్  సెక్రటరీ జనరల్  కే కోటేశ్వరరావు   సంక నారాయణ మూర్తి  ఇంకా ఇతర ఆఫీస్ బేరర్స్  ఈసీ మెంబర్స్ ఈ కార్యక్రమంలో భౌతికంగా  పాల్గొన్నారు. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కార్యక్రమ ఫోటోలు వీక్షించగలరు.

తులసి మొక్కల వితరణ కార్యక్రమము

కామెంట్‌లు