తెలంగాణ వి.సి గా రవీందర్ గుప్త

 

2006లో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి లో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా ఉస్మానియా యూనివర్సిటీ లో సీనియర్ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీ దాచేపల్లి రవీందర్ గుప్తా గారు నియమితులైనారు. వీరి స్వగ్రామం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం సంస్థాన్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసము నారాయణ పురంలో, డిగ్రీ నల్లగొండ ఎన్. జి. కాలేజీలో మరియు ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చేసి ఓయూ నుంచి 1989లో డాక్టరేట్ పొందారు. 1994లో యూజీసీ నుండి బెస్ట్ కెరీర్ అవార్డు, 1996లో యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా ఓయూ లో పనిచేస్తున్నప్పుడు విద్యారంగంపై పరిశోధనల కోసం అమెరికా, జర్మన్, స్వీడన్లో పర్యటించారు. వీరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నవి. 

కామెంట్‌లు