నివాళి


అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు శ్రీ కురపతి కోటేశ్వర రావు గారు, ఆగస్టు 24, 2020 న పరమపదించారు. వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు, నాబార్డ్‌లో పనిచేసే అవకాశాన్ని పొంది పదవీ విరమణ చేసే వరకు అక్కడే పనిచేశాడు. శ్రీ కోటేశ్వరరావు గారు తన అమూల్యమైన సేవలను హైదరాబాద్, అవోపాకి కార్యదర్శిగా మరియు అధ్యక్షుడిగా అందిస్తూ, ఎక్కడా అధ్యక్ష పదవి మర్యాదకు, గౌరవానికి, భంగం కలుగకుండా, దేనికీ రాజీ పడక, సోదర భావంతో మెలిగి అందరిని కలుపుకుని పనిచేశారు. తన కార్యాచరణలో లక్ష్యాలు పెట్టుకుని, ఆ లక్ష్యాలను విశేష కృషితో ఛేదించేవారు. అవోపా యొక్క విధి విధానాలను, ఆదర్శాలను నెరవేర్చుటకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ పాతతరం కొత్తతరం వారి మధ్య సంధానకర్తగా వ్యవహరించేవాడు. అతను అవోపా హైదరాబాద్ బిల్డింగ్ ఫండ్ మరియు ఎడ్యుకేషన్ ఫండ్ కోసం గణనీయమైన మొత్తాలను సమీకరించి అవోపా హైదరాబాద్ స్వంత ఫ్లాటు ఏర్పాటుకు కారణభూతుడయ్యాడు. అవోపా హైదరాబాద్ 26-04-2009 న నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకల గొప్ప విజయానికి ప్రాజెక్ట్ ఛైర్మన్‌గా శ్రీ కోటేశ్వర రావు గారు కీలక పాత్ర పోషించారు. అప్పటి ఆర్థిక మంత్రి శ్రీ కె.రోశయ్య మరియు అప్పటి తమిళనాడు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి బి.సుబాశిన్ రెడ్డి మాజీ చీఫ్ జస్టిస్ ను సత్కరించి వారిచే ప్రశంసలు పొందారు. అదే సమావేశంలో పూర్వాధ్యక్షులందరూ అతను అవోపాకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సత్కరించారు. ప్రస్తుత అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, పూర్వధ్యక్షుడు శ్రీ.పి.ఎస్.మూర్తి, శ్రీ బెల్ది శ్రీధర్ తదితరులు అతని సేవలను మననం చేసుకుంటూ అతని ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కావున తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శ్రీ కోటేశ్వరరావు గారి అకాల మృత్యువు కు చింతిస్తూ, వారి ఆత్మ శివైక్యం నొందాలని అభిలషిస్తున్నారు.



కామెంట్‌లు