అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించి నేటికి 21వ రోజు. పబ్బ వేదాస్ కృష్ణ s/o పబ్బ శివకృష్ణ - సారిక ( ఆస్ట్రేలియా ) పుట్టినరోజు సందర్భంగా, వీరి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, వేణిగంటి నిర్మల, తాటిపెల్లి గోపాలకృష్ణమూర్తి, యాంసాని నర్సింహమూర్తీ, గంపా రవీందర్, దెవా అరవింద్, దేవా మధుబాబు, కొండూరు పశుపతీశ్వర్ నాధ్, అల్లెంకి చంద్రశేఖర్ లు పాల్గొన్నారు. దాదాపు గా 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈ రోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అద్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి