అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 26వ రోజు (1) తమ్మిశెట్టి వినయ్ కుమార్ (టి.శృతి, వి.వినిత ల పుట్టినరోజు సందర్భంగా)(2) తాటిపెళ్ళి గోపాలకృష్ణమూర్తి - మాధవి ల పెళ్లి రోజు సందర్భంగా వీరల సహకారంతో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, గుంటూరు వెంకటనారాయణ, అల్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, దేవా అరవింద్, కొండూరు పశుపతి ఈశ్వర్ నాధ్, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 220 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈ రోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు, ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి