అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించి దిగ్విజయముగా నేటికి 34వ రోజు. ఈ రొజు 20మే 2020 రొజున శ్రీ పబ్బా వీరయ్య - నిర్మల (కుమారుడు - కోడలు రాజేందర్ - స్వప్న ల కుమార్తె హరిప్రియ అన్నప్రాసన సందర్భంగా, వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అద్య క్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, అనంతుల కుమారస్వామి, మద్ది బిక్షపతి, దొంతుల క్రృష్ణమూర్తి, తాటికొండ సుధాకర్, పబ్బా వీరయ్య, దేవా మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 220 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవొప హనుమకొండ అధ్యక్షుడు యెల్లంకి రవీందర్ కోరు కుంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి