అవోపా హనుమకొండ వారిచే ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్  రావు గారిచే ప్రారంభించి నేటికి 23వ రోజు.1) చందుపట్ల రాజలింగం - లక‌్ష‌్మి ల 57 వ పెళ్లి రోజు., 2)కల‌్లూరి శ్రీహర‌్ష (పుట్టినరోజు) s/o కల‌్లూరి శ్రీనివాస్ - ఉషశ్రీల పెళ్లి రోజు. 3) లెంకలపెళ‌్ళి జగన్ మోహన్ గుప‌్తా - నాగజ‌్యోతి 41 వ పెళ్లి రోజు సందర‌్బంగా ఈరోజు కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమంలో అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప‌్పారావు, ఫౌండర్ కే. రమణయ‌్య,మరియు అలుగూరి శివకుమార్, కంభంపాటి శ్రవన్ కుమార్, కొండూరు పశుపతి ఈశ‌్వర్నాథ్, అల‌్లెంకి చంద్రశేఖర్, మధుబాబు, గందె రఘువీర్ ప్రసాద్, దొంతుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 200  మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన‌్మకొండ అధ్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.


 


 


కామెంట్‌లు