అవొపా హనుమకొండ వారి ఆహార పంపిణీ


అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో  లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప‌్రధమ పౌరుడు (మేయర్ ) శ‌్రీ గుండా ప‌్రకాశ్  రావు గారిచే ప‌్రారంబించబడి 31మే 2020 నాటికి 45 రోజులు దిగ్విజయముగా గడచినవి. ఈ రోజు అహార పంపిణి కార్యక్రమమునకు దాతలుగా కంభంపాటి లక‌్ష‌్మణ్ - విజయలక‌్ష‌్మి ( న‌్యూడిల‌్లీ ) ల కుటుంబం, పేరెంట్స్ గురువయ‌్య - కౌశల‌్య మరియు సహోదరీ రావికంటి శారద ల జ‌్నాపకార‌్థం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, అలుగూరి శివకుమార్, కల‌్లూరు శ‌్రీనివాస్, అనంతుల కుమారస్వామి, కంభంపాటి శ‌్రవణ్ కుమార్, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు, అకినపెల‌్లి సత‌్యనారాయణ, తదితరులు పాల్గొని దాదాపు గా 250  మందికిపైగా ఆహారం అందించారు. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా, ఆయురారోగ్యాలు కూడా ప‌్రసాదించాలని కోరుకుంటున్నారు.


కామెంట్‌లు