అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి నేటికి 15వ రోజు. ఈ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం శ్రీ యం.వీ అప్పారావు ( గొందెల హారిక - సుమంత్ ) శ్రీ యిరుకుళ్ళ శివకుమార్ ల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, కోశాధికారి యం.వీ అప్పారావు, వ్వవస్థాపకులు పోకల చందర్, కే.రమణయ్య, యం.రామానుజం, మరియు కాపర్తి కోటిలింగం, అల్లెంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, రఘువీర ప్రసాదు, కందుకూరి ఆగయ్య, తాటిపెళ్ళి గోపాలకృష్ణమూర్తి, నాగమళ్ళ అశోక్, తదితరులు పాల్గొని 250 మందికి పైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన శ్రీ యం.వీ అప్పారావు ( గొందెల హరిక - సుమంత్) శ్రీ యిరుకుళ్ళ శివకుమార్ ల కుటుంబానికి "వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటుగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకుంటున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి