ఉప్పల ఫౌండేషన్ ద్వారా ఆహార పొట్లాల పంపిణీ


తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటినుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ తిలక్ నగర్, పటేల్ నగర్, నల్లకుంట, గోల్నాక, జయపురి కాలనీ 58 సర్వే నం., మనసురాబాద్, ఎల్బీనగర్, సాయిరాంనగర్, బండ్లగుడ, వీ స్పోర్ట్స్ కాలనీ, శివ ఫంక్షన్ హాల్ తో పాటుగా నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గారి నివాసం వద్ద భోజనాలు పంపిణీ చేసారు. అలాగే ప్రతీరోజూ 2వేలమంది పారిశుద్ధ్య కార్మికులకు, జీ.హెచ్.ఎం.సీ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, వలస కూలీలకు, జీ.హెచ్.ఎం.సీ పరిధిలోని కార్మికులకు, నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, మే9వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఉప్పల శ్రీనివాస్ గారు అన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆరెస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఉప్పల ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వనస్థలిపురం లోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఫౌండేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు ప్రతీరోజూ ఆహారం అందిస్తున్నారు. అయితే ఈరోజు నాగోల్ లోని వాత్సల్యం ఫౌండేషన్ లోని 60మంది అనాధ పిల్లలకు భోజనంతో పాటుగా మాస్కులను పంపిణీ చేసారు. అలాగే ఐదు వేల మాస్కులను తయారు చేయించి జీహెచ్ఎంసీ సిబ్బందికి, శానిటరీ సిబ్బందికి, వలస కూలీలకు, పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


కామెంట్‌లు