అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో 8వ రోజు ఆహారం పంపిణీ కార్యక్రమం విశాల్ ఎలక్టరికల్ అండ్ ఇంజనీరింగ్, కిర్లోస్కర్ మోటార్స్, చౌరస్తా, వరంగల్, యజమాని శ్రీ దేవా మహేందర్- లత దంపతుల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, మాడిశెట్టి శ్రీనివాసు, మాదారపు వేణుగోపాల్, దేవా మహేందర్, రఘువీరప్రసాద్, కాపర్తి కోటిలింగం తదితరులు పాల్గొని సుమారు 250 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన శ్రీ దేవా మహేందర్ - లత కుటుంబంనకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ వారి కమిటీ సభ్యులు కోరుకోనుచున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి