తేదీ 10.2.2020 రోజున ఆర్యవైశ్య సంఘం లక్షెట్టిపెట్ వారు చెట్ల రమేశ్, గడ్డం వికాస్ గారల సారథ్యంలో కలాంజలి ఫంక్షన్ హాలు లక్షెట్టిపెట్ లో ఇటీవల మున్సిపల్ర్న్ గా ఎన్నికైన శ్రీ నలమాసు కాంతయ్య గారికి మరియు కౌన్సిలర్ గా ఎన్నికైన సాయిని సుధాకర్ గారికి అభినందన సభ ఏర్పాటు చేయగా మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు గుండా సత్యనారాయణ గారు మరియు కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ గారు, చాలా మంది స్థానిక వైశ్య సోదర సోదరీమణులు, అవోపా సభ్యులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వారిని సన్మానించి అభినందించారు. అనంతరం ఏర్పాటుచేసిన రుచికరమైన భోజనాల నారగించి ఆహ్వానితులు సంతుష్టి నొందారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి