This is header
అవోపా హనుమకొండ వారి గాంధీ జయంతి వేడుకలు


తేదీ 2.10.2019 రోజున అవోపా హనుమకొండ వారు 150వ గాంధీ జయంతి సందర్భంగా వారి కార్యాలయ ఆవరణలో నున్న గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు మునిగేటి సత్యనారాయణ, కార్యదర్శి పొకల చందర్,  రామానుజం, రమణయ్య, శివకుమార్, శశిదర్ తదితరులు హాజరయ్యారు. తదుపరి స్పందన అనాథ ఆశ్రయంలో అన్న ప్రసాద పంపిణి చేశారు. 



This is footer
కామెంట్‌లు