అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించ బడి నేటికి 32వ రోజు. ఈ రోజు 18మే 2020 రోజున(1)పజ్జూరి సంతోష్ కుమార్ s/o పజ్జూరి కృష్ణమూర్తి, పుట్టినరోజు.(2)చిదరా రాజేశేఖర్ - విజయ దంపతులు. (3) తాటికొండ సురేష్ కుమార్ - అరుణా దేవి దంపతులు. వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, దోమకుంట్ల సంజీవయ్య,యాద చంద్రయ్య, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు,చిదరా రాజశేఖర్, పజ్జూరి కృష్ణమూర్తి, తాటికొండ సుధాకర్, తాటికొండ సురేష్ కుమార్, దొంతుల కృష్ణమూర్తి, అకినపెల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ కోరుకొనుచున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి